యూట్యూబ్లో అత్యధిక సబ్స్క్రైబర్లు ఉన్న చానల్గా భారత్కు టీసీరీస్ రికార్డుకెక్కడం తెలిసిందే. ఈ రికార్డు ఇంతకుముందు స్వీడిష్ యూట్యాబ్ స్టార్ చానల్ ప్యూడీపీ పేరుతో ఉండేది. అయితే దీన్ని నడపుగున్న ఫ్యూడీపీ అలియాస్ అర్విద్ ఉల్ఫ్ జెల్ బర్గ్.. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాడు. భారత్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాడు. భారతీయుల మెదళ్లు మలపూరితంగా మారాయని అతడు అన్నాడు. ఈ రికార్డుతో భారత దేశంలోని పేదరికం, అంటరానితనం పోతాయా? అని అక్కసు వెళ్లగక్కాడు. ‘టీసిరీస్ పైరేటెడ్ పాటలను అమ్ముకుంటోంది. పన్ను ఎగవేత ఆరోపణలను కూడా ఎదుర్కొంటోంది…’ అని అన్నారు. ప్యూడీపీని ఓడించడనికి భారీసంఖ్యో టీసిరీస్కు సబ్ స్క్రైబ్ చేయాలని బాలీవుడ్ నటులు ప్రచారం చేసిన నేపథ్యంలో అతడిలా స్పందించాడు.