న్యూఢిల్లీ : నూతన ఆర్థిక సంవత్సరంలో టాటా మోటార్స్ పటిష్ట పనితీరును చూపనుందన్న అంచనాలు మరింత ఊపందుకున్నాయి. నాలుగవ త్రైమాసికంలో క్యాష్ఫ్లో భారీగా మెరుగుపడే అవకాశమున్నట్లు విశ్లేషకులు చెపుతున్నారు. అయితే ఈ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఇలో 6 శాతం పెరిగి రూ.185వద్ద ట్రేడవుతోంది. అదేవిధంగా లగ్జరీ కార్ల బ్రిటిష్ అనుబంధ సంస్థ జెఎల్ఆర్ 2020 మార్చినాటికల్లా 2.5బిలియన్ పౌండ్ల క్యాష్ఫ్లోను సాధిస్తుందన్న అంచనాలున్నట్లు ఇప్పటికే టాటా మోటార్స్ తెలిపింది.