బీజింగ్ : చైనాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటీవరకు 24 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవక్షముంది అని స్థానిక మీడియా తెలిపింది. గత రెండు రోజులుగా ఉత్తర చైనాలోని షాక్సీ ప్రావిన్స్ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగుతున్నాయి. మంటల నేపథ్యంలో దాదాపు 7 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రజలను తరలించేందుకు 13 హెలిక్యాప్టర్లను ఉపయోగించిన రిస్య్కూ టీం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. వేసవి కాలంలో ఉత్తర చైనాలో తరచుగా మంటలు సంభవిస్తాయి.