న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల సందర్భంగా దేశ ప్రజలకు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏడాదిలోపే దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 22 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. అంతేకాక పేద, మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకోవడానికి ‘న్యాయ్’ పథకాన్ని ప్రకటించారు. ఉద్యోగ కల్పనలో ఎన్డీఏ ప్రభుత్వం విఫలమైందని రాహుల్ ఆరోపించారు. ప్రస్తుతం దేశంలో 22 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్న రాహుల్ అధికారం చేజిక్కితే 2020 మార్చి 31 నాటికి భర్తీ చేస్తామని ట్విట్టర్ వేదికగా తెలిపారు.