పసిడి ఎగసింది...వెండి తగ్గింది

SMTV Desk 2019-04-01 19:45:35  Gold Rate, Silver rate, Bullion market

దేశీ మార్కెట్లో సోమవారం పసిడి ధర పెరిగింది. పది గ్రాముల బంగారం ధర రూ.85 పెరుగుదలతో రూ.32,820కు చేరింది. అయితే అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్ బలహీనంగా ఉండటంతో మన మార్కెట్‌లో బంగారం ధర పెరుగుదల పరిమితంగానే నమోదయ్యింది. బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం తగ్గింది. కేజీ వెండి ధర రూ.20 క్షీణతతో రూ.38,580కు తగ్గింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ నెమ్మదించడం ప్రతికూల ప్రభావం చూపింది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.22 శాతం తగ్గుదలతో 1,295.55 డాలర్లకు క్షీణించింది. వెండి ధర ఔన్స్‌కు 0.35 శాతం తగ్గుదలతో 15.05 డాలర్లకు తగ్గింది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.85 పెరుగుదలతో రూ.32,820కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.85 పెరుగుదలతో రూ.32,650కు చేరింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.26,400 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.కేజీ వెండి రూ.20 తగ్గుదలతో రూ.38,580కు క్షీణిస్తే.. వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.311 తగ్గుదలతో రూ.37,450కు క్షీణించింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం విషయానికి వస్తే.. కొనుగోలు ధర రూ.80,000 వద్ద, అమ్మకం ధర రూ.81,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.31,860 వద్ద, 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,340 వద్ద ఉంది. కేజీ వెండి ధర రూ.40,500 వద్ద స్థిరపడింది.