నీరవ్ మోదీ కార్లు వేలం వేయనున్న ఈడీ

SMTV Desk 2019-04-01 16:56:09  neerav modi, golden visa, Britain government, london high court, arrest warrant, cars

ఇండియాలో వేల కోట్ల అప్పులతో బ్యాంకులను మోసం చేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి చెందిన 13 కార్లను ఈడి వేలం వేయనుంది. ఏప్రిల్‌ 18న వీటి వేలం జరిగే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే అతనికి సంబంధించిన పెయింటింగ్స్‌ను వేలం వేసి ఐటి శాఖ రూ. 54.84 కోట్లు రికవరీ చేసింది. ఇప్పుడు అతనికి సంబంధించిన లగ్జరీ కార్లు రోల్స్ రోయ్స్ ఘోస్ట్‌, రెండు మెర్సిడస్‌ బెంజ్‌, పోర్షె పనమెరా, మూడు హోండా కార్లు, టయోటా ఫార్చ్యూనర్‌, ఇన్నోవాలాంటి వాటిని వేలం వేయనున్నారు. మెటల్‌ స్క్రాప్‌ ట్రేడ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు ఈ వేలం కాంట్రాక్టు అప్పగించారు. అటు లండన్‌ జైల్లో ఉన్న నీరవ్‌కు గత వారం వెస్ట్‌ మినిస్టర్‌ కోర్టు బెయిల్‌ నిరాకరించింది.