అండమాన్నికోబార్, ఏప్రిల్ 1: అండమాన్ నికోబార్ దీవుల్లో 2 గంటల వ్యవధిలోనే తొమ్మిది సార్లు భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై వీటి తీవ్రత 4.7 నుంచి 5.2గా నమోదైంది. మొదట తెల్లవారుజామున 5:14 గంటల సమయంలో భూమి కంపించగా, రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.9గా నమోదైంది. మళ్లీ రెండు నిమిషాల తర్వాత భూమి కంపించింది. చివరగా 6:54 గంటల సమయంలో 5.2 తీవ్రతతో భూమి కంపించింది. ఇలా రెండు గంటల వ్యవధిలో తొమ్మిది సార్లు భూమి కంపించింది.