సుల్తాన్‌ అజ్లాన్‌ షా కప్‌ను సొంతం చేసుకున్న సౌత్‌కొరియా

SMTV Desk 2019-04-01 15:04:28  Sultan Azlan Shah Cup 2019, India Lose To Korea In Shootout, South Korea, india

కౌలాలంపూర్‌, ఏప్రిల్ 1: సుల్తాన్‌ అజ్లాన్‌ షా కప్‌ హాకీ ఫైనల్లో ఇండియా జట్టుకు సౌత్‌కొరియా గట్టి పోటీ ఇచ్చింది. స్కోరు 4-2గా ఉంది. అయితే షూటౌట్‌లో కొరియా కెప్టెన్‌ లీ నామ్‌ యంగ్‌ ఒక గోల్‌ చేశాడు. ఇలాంటి పెనాల్టీ గోల్‌ ఇప్పటివరకు నమోదు కాలేదేమో అనే చర్చ జరుగుతుంది. భారత యువ గోల్‌ కీపర్‌ కిషన్‌ బీ పాఠక్‌ను అయోమయంలో పడేసి ఓ స్కూప్‌ షాట్‌తో గోల్‌ చేశాడు లీ నామ్‌ యంగ్‌. ఈ గోల్‌కు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ గోల్‌తో దక్షిణకొరియా 4-2తో గెలిచి ట్రోఫీని సొంతం చేసుకుంది.