శ్రీనగర్: జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఫయాజ్ అహ్మద్ లోనేను జమ్మూ, ఢిల్లీ ప్రత్యేక పోలీసులు సోమవారం శ్రీనగర్ లో అదుపులోకి తీసుకున్నారు. ఇక ఫయాజ్ అహ్మద్ ఆచూకీ తెలిపినా, అతడి తల తెచ్చి ఇచ్చినా రెండు లక్షల రూపాయల రివార్డు ఇస్తామని ఢిల్లీ పోలీసులు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాది ఫయాజ్ అహ్మద్ పై కోర్టులో నాన్ బెయిలబుల్ వారంట్ ఉంది. మార్చి 21న పూల్వామా ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి ముదాసిన్ అహ్మద్ ఖాన్ అనుచరుడు సజ్జద్ ఖాన్ను ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ వద్ద అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు, అతన్ని ఎన్ఐఎకు అప్పగించారు.