హైదరాబాద్, ఆగస్ట్ 14 : హీరోయిన్ల డేట్లు చూసే మేనేజర్లే వాళ్ళకు వచ్చిన అవకాశాలను పాడు చేస్తున్నారంటూ "మా అధ్యక్షుడు శివాజీ రాజా" వ్యాఖ్యానించారు. ఓ టీవి ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అయన మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో దళారులు ఎక్కువయ్యారని తెలిపారు. అందరు కాకపోయినా 30 శాతం మంది మేనేజర్లు అలాగే ఉన్నారు. కేవలం వారి వల్లనే హీరోయిన్ లకు వచ్చే అవకాశాలు రాకుండా పోతున్నాయి. కొందరు మేనేజర్లు వారిలో వారు కుమ్మక్కై హీరోయిన్స్ కి అవకాశాలు కల్పిస్తే, మరికొందరు వారిని ఖాళీగా ఉంచుతున్నారని అన్నారు. అలాంటి వారిని తొలగిస్తే తప్ప పరిస్థితులు మారవని, అప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి మంచి హీరోయిన్స్ కొరత అలాగే ఉంటుందని తెలిపారు.