భారత దేశపు తొమ్మిదో ప్రధానిగా పనిచేసిన ఆర్థిక సంస్కరణల పితామహుడు పి.వి.నరసింహారావు జీవితం ఆధారంగా ‘పి.వి. నరసింహారావు-ఛేంజ్ విత్ కంటిన్యుటీ’ పేరుతో డాక్యుమెంటరీ రూపొందుతోంది. 1957లో శాసన సభ్యుడిగా రాజకీయ జీవితం ఆరంభించిన ఆయన మంత్రిగా, ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే. 1991లో ఆయన చేసిన ఆర్థిక సంస్కరణలు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయని.
ఈ డాక్యుమెంటరీలో నరసింహారావుతో కలిసి పనిచేసిన మంత్రులు, ఆయన స్నేహితులు, కుటుంబ సభ్యులు, పలువురు జర్నలిస్టులు చెప్పిన సమాచారాన్ని చూపించనున్నారు. జూన్లో ఈ పూర్తి డాక్యుమెంటరీని విడుదల చేయబోతున్నారు. ఈ డాక్యుమెంటరీకి శ్రావణి, శ్రీకర్లు దర్శక నిర్మాతలుగా వ్యవహరించారు.