న్యూఢిల్లీ: పాన్ నంబరుతో ఆధార్ కార్డు అనుసంధానం చేసుకోవడానికి గడువు పెంచుతూ ప్రభుత్వం ఆదివారం ఒక ప్రకటన జారీ చేసింది. ఇంతకు ముందు ప్రకటించిన గడువు మార్చి 31వ తేదీతో ముగిసింది. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ గడువు 2019 సెప్టెంబరు 30 నాటికి ముగియనుంది. ఇప్పటికే ఆదాయ పన్నుల శాఖ ఈ అనుసంధానాన్ని తప్పనిసరి చేసింది. 2019-20 సంవత్సరానికి ఐటి రిటర్నులు ఫైల్ చేయాలంటే ఈ అనుసంధానం తప్పనిసరి. మొత్తం నాలుగు విధానాల్లో ఈ అనుసంధానం చేసుకొనేట్లు ఆదాయపన్ను శాక ఏర్పాట్లు చేసింది.అయితే తాజాగా ఆరు నెలల పాటు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది.