హైదరాబాద్, మార్చ్ 31: ఐపీఎల్ 2019 సీజన్లో భాగంగా నేడు సన్రైజర్స్ హైదరాబాద్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో హైదరాబాద్ బెంగుళూరు ను చిత్తు చేసింది. బెంగుళూరును 113 పరుగుల వద్ద ఆలౌట్ చేసి 118 పరుగుల తేడాతో హైదరాబాద్ సంచలన విజయాన్ని సాధించారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇక హైదరాబాద్ 231/2 పరుగులు చేసి బెంగళూరుకు 232 పరుగుల విజయ లక్ష్యాన్ని ముందుంచింది. అయితే మొదటి ఇన్నింగ్స్ లో ఓపెనర్స్ గా డేవిడ్ వార్నర్, జానీ బెయిర్స్టో క్రీజులోకి అడుగుపెట్టారు. మొయిన్ అలీ బౌలింగ్ లో పరుగులు తీయడం స్టార్ట్ చేసిన జానీ బెయిర్స్టో మెరుపు సెంచరీ చేసి 114(56)వద్ద అవుటయ్యాడు. వీరిద్దరి భాగస్వామ్య పరుగులు 185.