రాజస్థాన్‌లో కుప్పకూలిన మిగ్-27 విమానం.

SMTV Desk 2019-03-31 17:33:21  rajasthan ,

మరో మిగ్-27 యూపీజీ విమానం తాజాగా రాజస్థాన్ లో కుప్పకూలింది. జోథ్ పూర్ ఎయిర్ బేస్ నుంచి బయల్దేరిన కాసేపటికే రాడార్ పై విమానం ఆచూకీ గల్లంతైంది. జోథ్ పూర్ కు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిరోహీ ప్రాంతంలో ఈ మిగ్ విమానం కూలిపోయినట్టు గుర్తించారు. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఫైలట్‌ కూడా ప్రాణాలతో బయటపడటంతో వాయుసేన అధికారులు ఊపిరి పీల్చుకున్నాయి.

మిగ్ విమానాలు ఎంతో గొప్పవని మనం చెప్పుకుంటున్నా... ప్రస్తుతం అయితే ఆ పరిస్థితి కనిపించడం లేదు. కొంతకలంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన మిగ్ విమానాలు కూలిపోతూ ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్నిరోజుల క్రితం బికనీర్‌లో మిగ్-21 విమానం కూలిపోయింది. తాజాగా ఇప్పుడు మరో విమానం కూడా కూలడంతో ఎయిర్ ఫోర్స్ అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

దీంతో మిగ్ వాహనాల్ని స్క్వాడ్రన్ల నుంచి తొలగించాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. గతంలో మిగ్ విమానాలు కూలిన ఘటనల్లో కొందరు పైలట్లు మృతి చెందారు.