హైదరాబాద్, మార్చ్ 31: ఐపీఎల్ 2019 సీజన్లో భాగంగా నేడు సన్రైజర్స్ హైదరాబాద్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉప్పల్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గాయం కారణంగా సన్రైజర్స్ రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్కి దూరమవగా.. అతని స్థానంలో భువనేశ్వర్ జట్టుని నడిపించనున్నాడు. తాజా సీజన్లో రెండు మ్యాచ్లాడిన సన్రైజర్స్ జట్టు.. కోల్కతా నైట్రైడర్స్ చేతిలో అనూహ్యంగా ఓడి.. ఇటీవల రాజస్థాన్ రాయల్స్పై 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మరోవైపు ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ బెంగళూరు జట్టు పేలవంగా పరాజయాన్ని చవిచూసింది. తొలుత చెన్నై చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడిన కోహ్లీసేన.. ఆ తర్వాత ముంబయి చేతిలో ఆఖరి ఓవర్లో 6 పరుగుల తేడాతో ‘నోబాల్’ వివాదం నడుమ ఓడింది.
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు : డేవిడ్ వార్నర్, జానీ బెయిర్స్టో (వికెట్ కీపర్), విజయ్ శంకర్, మనీశ్ పాండే, దీపక్ హుడా, యూసఫ్ పఠాన్, రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, భువనేశ్వర్ కుమార్ (కెప్టెన్), సందీప్ శర్మ, సిద్ధార్థ కౌల్ .
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు: పార్థీవ్ పటేల్ (వికెట్ కీపర్), మొయిన్ అలీ, విరాట్ కోహ్లి (కెప్టెన్), ఏబీ డివిలియర్స్, సిమ్రాన్ హిట్మెయర్, గ్రాండ్హోమ్, శివమ్ దూబే, చాహల్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రయాస్ బర్మాన్.