కేరళలోని వయనాడ్ నుంచి పోటీ

SMTV Desk 2019-03-31 15:14:04  rahul gandhi,

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న రెండోస్థానం ఖరారు అయ్యింది. కేరళలోని వాయినాడ్‌ నుంచి పోటీ చేసేందుకు నిర్ణయించినట్టు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది.

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రెండు స్థానాల నుంచి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని అమేథీతో పాటు కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేయనున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా ఆదివారం మీడియా సమావేశంలో తెలిపారు.