ఏపీ ఇంటిలిజెన్స్ కొత్త చీఫ్ నియామకం

SMTV Desk 2019-03-31 12:31:21  AP Inteligence,

అమరావతి: ఏపీ ఇంటిలిజెన్స్ కొత్త చీఫ్ గా కుమార్ విశ్వజిత్ నియమితులయ్యారు. ఆయన్ని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇకపోతే 1994 బ్యాచ్ కు చెందిన విశ్వజిత్.. ప్రస్తుతం ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ ఛైర్మన్‌గా పని చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు ఇంటిలిజెన్స్‌ డీజీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును కేంద్రం ఎన్నికల సంఘం బదిలీ చేసింది.