పంజాబ్ టార్గెట్ 177

SMTV Desk 2019-03-30 19:13:04  Punjab, Mumbai

మొహాలీ: వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబయి ఇండియన్స్ మధ్య జరుగుతున్న ఐపిఎల్ తొమ్మిదో మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. పంజాబ్ కు 177 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. ముంబయి ఇన్నింగ్స్ లో ఓపెనర్ డికాక్ అర్ధశతకం(39 బంతుల్లో 60: 6 బౌండరీలు, 2 సిక్సర్లు)తో చెలరేగితే, మరో ఓపెనర్ రోహిత్ శర్మ(32) పరుగులతో రాణించాడు. చివరలో హార్ధిక్ పాండ్య(19 బంతుల్లో 31: 3 ఫోర్లు, ఒక సిక్సర్) మెరుపులు మెరిపించడంతో ముంబయి భారీ స్కోర్ చేసింది. పంజాబ్ బౌలర్లలో ముర్గన్ అశ్విన్, విల్జోయిన్, షమీ చెరో 2 వికెట్లు, అండ్రూ టై ఒక వికెట్ పడగొట్టారు.