జర్మనీలో భారతీయ దంపతులపై దాడి..

SMTV Desk 2019-03-30 19:09:53  crime

జర్మనీలోని మ్యూనిచ్‌లో ఓ భారతీయ జంటపై దాడి జరిగింది. గుర్తు తెలియని ఇమ్మిగ్రెంట్(వలసదారుడు) వారిపై కత్తితో దాడికి తెగబడ్డాడు. దాడిలో భర్త మృతి చెందగా.. భార్య తీవ్ర గాయాలపాలైంది. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. వారి పిల్లల భద్రతను పర్యవేక్షించాల్సిందిగా మ్యూనిచ్‌లోని భారత దౌత్య కార్యాలయాన్ని ఆదేశించినట్టు తెలిపారు.


ప్రశాంత్-స్మిత దంపతుల పిల్లలు సాక్షి, శ్లోక ప్రస్తుతం జర్మనీలోని భారత దౌత్య అధికారుల పర్యవేక్షణలో ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే, ప్రశాంత్-స్మిత ఇద్దరూ మంగళూరు యూనివర్సిటీలో కలిసి చదువుకున్నారు. 2016లో జర్మనీలోని ఎయిర్‌బస్ హెలికాప్టర్స్ సంస్థలో పనిచేసేందుకు ప్రశాంత్ జర్మనీ వెళ్లారు. వీరికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.