సీటు కోసం గొడవ.. రైల్లోంచి తోసేసిన దుండగులు

SMTV Desk 2017-08-13 18:54:28  TRAIN, SEAT, PASSENGERS, MURDER

న్యూఢిల్లీ, ఆగస్ట్ 13 : కొద్దిసేపు కూర్చొని ఎవరి దారిన వాళ్ళు పోయే ట్రైన్ లోని సీట్ కోసం ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఈ ఘటన న్యూఢిల్లీ-ఆగ్రా ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ లో చోటు చేసుకుంది. కొందరు వ్యక్తులు సీటు కోసం గొడవపడి కదులుతున్న రైలులోంచి ఇద్దరు ప్రయాణికులను కిందకు తోసేశారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. తనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ రైలు బల్లాబ్గర్‌, అసావోటి గ్రామానికి చేరుకోగానే ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని తెలిపారు. గతంలో కూడా ఓ వ్యక్తిని రైలు కింద తోసి హత్య చేసారు. అప్పట్లో మతోన్మాద౦తో చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన కూడా అలాంటిదేనా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితుల‌ కోసం గాలిస్తున్నారు.