ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పీడు పెంచేశారు. ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో ఆయన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటనలు చేసిన ఆయన నేడు మరో జిల్లాను చుట్టి రానున్నారు. ఇందులో భాగంగా చంద్రబాబు నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన ఈరోజు ఐదు నియోజకవర్గాలు కవర్ చేయనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు ఇచ్చాపురం చేరుకుంటారు అక్కడ బహిరంగ సభలో పాల్గొన్నాక రాజాం, ఎచ్చెర్ల నోయోజకవర్గంలో బహిరంగ సభల్లో పాల్గొంటారు, రాత్రికి శ్రీకాకుళం చేరుకొని నవ భారత్ జంక్షన్ నుండి ఏడూ రోడ్ల కూడలి వరకూ రోడ్ షో నిర్వహిస్తారు.
ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక మరోపక్క జగన్ గెలుపు కోసం ఆతన కుటుంబం అంతా కష్టపడుతోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం 9.30 గంటలకు కర్నూలు జిల్లా నందికొట్కూరు, 11.30 గంటలకు ఎమ్మిగనూరు, మధ్యాహ్నం 1.30 గంటలకు అనంతపురం జిల్లా మడకశిర, 3.30 గంటలకు పెనుకొండ నియోజక వర్గంలోని సోమందేపల్లిలో జరిగే సభల్లో వైఎస్ జగన్ పాల్గొంటారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్ సోదరి షర్మిల గుంటూరు పార్లమెంటు పరిధిలోని గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో పాల్గొంటారు. వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శనివారం ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు పరిధిలోని యర్రగొండపాలెం నియోజకవర్గంలో నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు.