వరుస పేలుళ్లతో జమ్మూకశ్మీర్ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా జమ్మూలోని రాంబన్ జిల్లాలో మరోసారి పేలుడు సంభవించింది. బనిహల్లో నిలిపి ఉంచిన సాంత్రో కారులో ఈ పేలుడు జరిగింది. దీంతో స్థానికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.కాగా ఈ ఘటన జరిగిన ప్రాంతానికి కొంత దూరంలో సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్ ఉంది.
అయితే జవాన్లను లక్ష్యంగా చేసుకునే పేలుడు జరిపి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో అలాంటిందేం లేదని సీఆర్పీఎఫ్ వర్గాలు వెల్లడించాయి. కారులోని సిలిండర్ పేలుడు సంభవించిందా? లేదా మరైదైనా కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సీఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.