వచ్చే నెల ఏప్రిల్ 1,2వ తేదీల్లో ప్యాసింజర్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. కాజీపేట-కొండపల్లి రైల్వేస్టేషన్ల మధ్య గూడ్స్ రవాణా కోసం(ట్రాఫిక్ బ్లాక్) పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే కాజీపేట రైల్వే స్టేషన్కు సమాచారం అందజేసింది.
విజయవాడ నుంచి కాజీపేటకు నడిచే ప్యాసింజరు(57238)ను ఏప్రిల్ 1న, కాజీపేట నుంచి విజయవాడకు నడిచే ప్యాసింజరు(57237)ను 2వ తేదీన రద్దు చేస్తున్నారు.
కాగజ్నగర్-కాజీపేట మధ్య నడిచే ప్యాసింజరు(67204)ను ఏప్రిల్ 1వ తేదీన రద్దు చేస్తున్నారు. భద్రాచలంరోడ్-సిర్పూర్కాగజ్నగర్ మధ్య నడిచే సింగరేణి ప్యాసింజరు (67203) 1న డోర్నకల్ వరకు మాత్రమే పాక్షికంగా నడుస్తుంది. బల్లార్షా నుంచి భద్రాచలం రోడ్ వెళ్లే సింగరేణి ప్యాసింజరు (67202) ఏప్రిల్ 1వ తేదీ వరంగల్ వరకు మాత్రమే నడుస్తుంది.
సికింద్రాబాద్-గుంటూరు మధ్య నడిచే గోల్కొండ ఎక్స్ప్రెస్ (17202) సికింద్రాబాద్లో మధ్యాహ్నం 13.00 గంటలకు బయల్దేరాల్సి ఉండగా 15.00 గంటలకు బయలుదేరుతుంది.
ఏప్రిల్ 1న తిరుపతి-ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్ప్రెస్ (17405) 1 గంట 45 నిమిషాలు, నర్సాపూర్-షిర్డీ సాయినగర్ ఎక్స్ప్రెస్ (17213) 1 గంట 15 నిమిషాలు, విశాఖ-నిజాముద్దీన్ స్వర్ణజయంతి ఎక్స్ప్రెస్ (12803) 1 గంట 20 నిమిషాలు, విశాఖపట్నం-న్యూదిల్లీ ఏపీ ఎక్స్ప్రెస్ (22415) 50 నిమిషాలు ఆలస్యంగా నడుస్తాయి.