రాజకీయాల్లో ప్రవేశించిన దక్షిణాది నటుడు ప్రకాశ్రాజ్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. బెంగళూరు సెంట్రల్ నియోజవర్గం నుంచి ప్రకాశ్ ఇండిపెండెంట్గా బరిలోకి దిగాడు. ఈ నేపథ్యంలోనే ఆయనపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు అందాయి.
ప్రకాశ్రాజ్కు ఒకటి కంటే ఎక్కువ ఓటర్ గుర్తింపు కార్డులున్నాయని బీజేపీ కార్యవర్గ సభ్యుడు గిరీశ్ కుమార్ ఈసీకి ఫిర్యాదు చేశాడు. ప్రకాశ్రాజ్కు తమిళనాడులో రెండు, తెలంగాణలో ఒకటి, బెంగళూరు శాంతినగర్లో ఒకటి ఓటర్ కార్డు ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మూడు రాష్ట్రాలకు కలిపి నాలుగు ఓటర్ ఐడీలున్నాయని, ఇది రాజ్యాంగానికి విరుద్దమని, రాజ్యాంగం ప్రకారం ఒకరికి ఒక ఓటర్ కార్డు మాత్రమే ఉండాలన్నారు. అన్ని కార్డులు తీసుకున్న ప్రకాశ్రాజ్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ను కోరారు.