వివేకా హత్యపై ఏప్రిల్‌ 15 వరకు మాట్లాడొద్దు

SMTV Desk 2019-03-30 11:59:23  vivekananda reddy

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్యోదంతం కేసును సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసును వచ్చే నెల 15కు వాయిదా వేసిన ఉన్నత న్యాయస్థానం.. పలు కీలక సూచనలు చేసింది. వివేకా హత్యపై ఏప్రిల్‌ 15 వరకు సిట్‌ అధికారులు మాట్లాడవద్దని ఆదేశించింది. ఈ వ్యవహారంపై మాట్లాడబోమని కోర్టుకు అంగీకారపత్రం ఇవ్వాలని సూచించింది. ఈ కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తన విచారణను కొనసాగించుకోవచ్చని స్పష్టంచేసింది.