హిందూపురం వైసీపీ లోక్ సభ అభ్యర్థి గోరంట్ల మాధవ్‌కు పితృవియోగం

SMTV Desk 2019-03-30 10:09:56  Madhav

అనంతపురం : హిందూపురం వైఎస్సార్ పార్టీ లోక్‌సభ అభ్యర్ధి గోరంట్ల మాధవ్‌ నివాసంలో విషాదం నెలకొంది. శుక్రవారం ఆయన తండ్రి మాధవస్వామి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయస్సు 85 సంవత్సరాలు. ఎన్నికల ప్రచారంలో ఉన్న గోరంట్ల మాధవ్ తండ్రి మరణవార్త విన్న వెంటనే.. ప్రచారాన్ని నిలిపివేసి స్వగ్రామానికి బయలుదేరారు. కర్నూలు జిల్లా రుద్రవరంలో మాధవ్ తండ్రికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మాధవ్ తండ్రి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంతాపం తెలియజేసింది.