న్యూఢిల్లీ, ఆగస్ట్ 13 : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సమయం సమీపిస్తోంది. ఆరోజు పలుచోట్ల జరిగే జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని ఉగ్రవాద దాడులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉ౦డడంతో ఢిల్లీ పోలీసులు ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడే భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తూ.. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫోటోలను విడుదల చేశారు. ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం, దేశ రాజధాని వీధుల్లో ఇద్దరు ఆల్ కాయిదా ఉగ్రవాదుల పోస్టర్లను అంటించారు. వీరి ఆచూకీ తెలిసిన వారు 011-24641278, 011-23016770 అనే న౦బర్లకు ఫోన్ చేసి తెలపాలని పోలీసులు కోరారు. కాగా శాంతి భద్రతలను పటిష్ట పరిచేందుకు, ఉగ్ర దాడులను తిప్పి కొట్టేందుకు 14 పరాక్రమ్ వ్యాన్లను ఇదివరకే ఎర్రకోట వద్ద మోహరించారు.