పులివెందులలో అత్యంత దారుణ హత్యకు గురైన వైసీపీ నేత, జగన్ చిన్నాన, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్లపై వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్లపై వాదనలు విన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. తీర్పును మాత్రం సోమవారానికి వాయిదా వేసింది. వివేకానంద హత్య కేసును సీబీఐకి విచారణ అప్పగించాలంటూ ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, వైఎస్ వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.