పురంధేశ్వరి, అవంతి శ్రీనివాస్ ల మీద ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు !

SMTV Desk 2019-03-29 12:14:50  puranbdheswari,

విశాఖ నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి, భీమిలి అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్‌ ల మీద కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. వీరిద్దరూ ఎన్నికల నియమావళి ఉల్లంఘించారంటూ తెలుగుశక్తి అధ్యక్షుడు బీవీ రామ్ కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశారు. ఎయిరిండియా ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా పురంధేశ్వరి రాజీనామా చేయలేదని ఆమె మీద, 2014 నామినేషన్లో విద్యార్హతలు చూపించని అవంతి శ్రీనివాస్ 2019 నామినేషన్లో డిగ్రీ చదివినట్లు పేర్కొన్నారని అవంతి మీదా రామ్ ఫిర్యాదు చేశారు.

ఇదొక్కటే కాక వారిద్దరూ తమపై ఉన్న క్రిమినల్‌ కేసుల గురించి పత్రికలు, ఛానళ్లలో ప్రకటనలు ఇవ్వలేదని పేర్కొన్నారు. పరిశ్రమలకు అనుమతి సమయంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపినట్లుగా పోటీచేసే అభ్యర్థుల విషయంలోనూ నామపత్రాల పరిశీలన లోపు ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని రామ్‌ ఈసీని కోరారు.