హైదరాబాద్ : ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం జరిగే ఐపిఎల్ మ్యాచ్లకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని రాచకొండ సిపి మహేశ్ భగవత్ తెలిపారు. 2,300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. 300 సిసి కెమెరాల నిఘా మధ్య ఐపిఎల్ మ్యాచ్లు జరుగుతాయని ఆయన చెప్పారు. ఇప్పటికే స్టేడియంలో డాగ్, బాంబు స్కాడ్ బృందాలు తనిఖీలు చేశాయని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్, రాజస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో స్టేడియంలోకి సెల్ పోన్లు తీసుకరావద్దని ఆయన సూచించారు.