పశ్చిమ బెంగాల్, ఆగస్ట్ 13: దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా పిల్లలకు క్విజ్, వక్తృత్వం పోటీలు, దేశభక్తి నిండిన నినాదాల పోటీలు జరుగుతుండగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మాత్రం ఆ కార్యక్రమాలు నిర్వహించవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. ఎప్పుడూ భాజపా ప్రభుత్వ పాలనపై ఆగ్రహాన్ని వ్యక్త పరిచే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ... తాజాగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా తమ రాష్ట్రంలో పలు ఆదేశాలు జారీ చేశారు. దేశంలోని సర్వ శిక్ష మిషన్ ఆధ్వర్యంలోని పాఠశాలల్లో స్వాతంత్ర్య దినోత్సవాలను పురస్కరించుకుని పిల్లలకు వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని ఎంహెచ్ఆర్డీ ఆదేశించింది. అభివృద్ధి, సమైక్యత, స్వచ్ఛత ప్రతిజ్ఞలు చేయించాలని తెలిపింది. కాగా, మమతా బెనర్జీ మాత్రం ఆ కార్యక్రమాలు నిర్వహించవద్దని ఉత్తర్వులిచ్చారు.