బెంగుళూరుపై ముంబయి ఇండియన్స్‌ గెలుపు…

SMTV Desk 2019-03-29 10:43:00  bangalore, mumbai

బెంగళూరు: ఐపిఎల్ 12వ సీజన్ లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై ముంబయి ఇండియన్స్‌ గెలిచింది. దీంతో ముంబయి ఈ సీజన్లో తొలి విజయాన్ని అందుకుంది. ముంబయి నిర్దేశించిన 188 పరుగుల లక్ష్య ఛేదనలో బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 181 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. విరాట్ కోహ్లీ 46, పార్థీవ్ పటేల్ 31 పరుగులతో రాణించారు. ఎబి డివిలియర్స్ 70 (నాటౌట్) చివరి ఓవర్ వరకు నిలిచినా బెంగళూరును గెలిపించలేకపోయాడు. ముంబయి బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు, మయాంక్ ఒక వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబయికి కెప్టెన్ రోహీత్ శర్మ 48, ఓపెనర్ డికాక్ 23 పరుగుల చేసి శుభారంభాన్ని అందించారు. సూర్యకుమార్ 38, యవరాజ్ సింగ్ 23 పరుగులతో రాణించారు. చివర్లో హర్దిక్ పాండ్యా (32) మెరుపులు మెరిపించడంతో ముంబయి 187 భారీ స్కోరు చేసంది.