జగన్ సభలో ప్రమాదం: ఒకరు మృతి

SMTV Desk 2019-03-28 16:21:48  jagan, one died

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందర్భంగా వైసిపి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో ప్రచారం సందర్భంగా మండపేటకు జగన్ రావడంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రోడ్లు మొత్తం రద్దీగా మారడంతో ప్రజలు భవనాల పైకి ఎక్కారు.

ఈ సమయంలో రోడ్డుపక్కన ఉన్న ఓ భవనం పిట్టగోడ కూలింది. దీంతో భవనంపైన ఉన్న సుమారు 40 మందితోపాటు భవనం కింద నిలబడిన మరో 10 మంది కూడా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. గాయపడిన వారిని వెంటనే మండపేట ఆస్పత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.