రాజకీయాల్లో మార్పు దిశగా జనసేన అడుగులేస్తోంది, ఇంతకూ ముందే అభ్యర్థులకు ప్రత్యేక పరీక్షలు పెట్టి ఎంపిక చేసి కొత్త తరహా రాజకీయాలకు శ్రీకారం చుట్టిన జనసేన ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న జనసేన నాయకుడు, సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఎవరూ ఊహించని, రాజకీయాల్లో సాధ్యం కాని వాగ్దానం ఒకటి చేసారు. తమ పార్టీ మ్యానిఫెస్టోను బాండ్ పేపర్ మీద ఇవ్వనున్నామని, మానిఫెస్టోలో పేర్కొన్న హామీలు అమలు చేయని యెడల తమను కోర్టుకు ఈడ్చే అవకాశం ఉందని అన్నారు.
లక్ష్మీనారాయణ ప్రకటించిన ఈ నిర్ణయంపై జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తుండగా, సామాన్య ప్రజలు సైతం జేడీని ప్రశంసిస్తున్నారు. ఇంకొంత మంది పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు టీడీపీ, వైసీపీలకు మ్యానిఫెస్టోను బాండ్ పేపర్ మీద ఇచ్చే దమ్ముందా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు