బయోపిక్ ల ట్రెండ్ లో వరుసగా రాజకీయ నాయకుల బయోపిక్ లు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు ఎన్నికల హడావుడి.. మరోవైపు బయోపిక్ ల హడావుడి అంతకంతకు వేడెక్కిస్తోంది. ఎన్టీఆర్, వైయస్సార్, థాక్రే, మన్మోహన్ సింగ్ బయోపిక్ లు తెరకెక్కి రిలీజయ్యాయి. తాజాగా నరేంద్ర మోదీ బయోపిక్ సెట్స్ పై ఉంది. త్వరలో రిలీజ్ కి రాబోతోంది.
మోదీ బయోపిక్ గురించి ఆసక్తికర ముచ్చట సాగుతుండగానే, మరోవైపు బహుజన్ సమాజ్ వాదీ పార్టీ (బిఎస్పి) అధినేత్రి, దీదీ మాయావతి బయోపిక్ ని తెరకెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ బయోపిక్ కి జాలీ ఎల్.ఎల్.బి ఫేం సుభాష్ కపూర్ దర్శకత్వం వహించనున్నారు. ఇక ఈ చిత్రంలో కథానాయికగా ఎవరు నటిస్తారు? అంటే విద్యాబాలన్ పేరును ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఇప్పటికే ఎనిమిది మంది పేర్లు పరిశీలించినా ట్యాలెంటెడ్ బాలన్ కే ఆ అవకాశం దక్కిందని తెలుస్తోంది. మరోవైపు విద్యాబాలన్ అటు నార్త్, ఇటు సౌత్ రెండు చోట్లా పలు క్రేజీ ప్రాజెక్టులకు సంతకాలు చేసింది. బాలన్ టైటిల్ పాత్రలో ఇందిరా గాంధీ బయోపిక్ తరకెక్కనుంది. ఈ లోగానే మాయావతి పాత్రలోనూ బాలన్ కి అవకాశం దక్కడం బిగ్ సర్ ప్రైజ్ అని మాట్లాడుకుంటున్నారంతా. తమిళంలో పింక్ రీమేక్ లో అజిత్ సరసన నాయికగా నటిస్తోంది.