జగన్ కోసం రంగంలోకి వై ఎస్ భారతి.!

SMTV Desk 2019-03-28 12:38:10  Y S Bharathi,ys jagan

ఒక పక్క ఎన్నికలు దగ్గరకు సమీపిస్తుండడంతో అన్ని పార్టీల వారు తమ పార్టీ ఎన్నికల ప్రచార జోరుని పెంచేశారు.ఒక పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎడతెరపి లేకుండా ప్రచారం నిర్వహిస్తుంటే..తన సినిమాలో నటించిన గబ్బర్ సింగ్ అంత్యాక్షరి టీమ్ పవన్ కోసం ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.అలాగే ప్రతి పక్ష నేత వై ఎస్ జగన్ అయితే ఇతర పార్టీల ప్రచారంతో పోల్చితే ఒకడుగు ముందున్నారనే చెప్పాలి.

ఎందుకంటే అన్న గెలుపు కోసం ఒక పక్క తన సోదరి షర్మిల ప్రచారం చేస్తుంటే మరో పక్క జగన్ మాతృమూర్తి విజయమ్మ కొడుకు గెలుపు కోసం బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు.ఇప్పడు తన భర్త గెలుపు కోసం జగన్ సతీమణి వై ఎస్ భారతి రంగంలోకి దిగారు.జగన్ కు వేంపల్లి నియోజకవర్గంలో ఎంతటి పట్టు ఉందో అందరికీ తెలుసు.దాన్ని మరింత పటిష్టం చెయ్యడానికి భారతి ఎన్నికల ప్రచారాన్ని అట్టహాసంగా మొదలు పెట్టారు.ఆమె వెంట రవికుమార్ రెడ్డి మరియు షబ్బీర్ వల్లి అండగా నిలబడ్డారు.మరి వై ఎస్ భారతి ఎన్నికల ప్రచారం ఒక్క వేంపల్లి లోనేనా లేక ఇతర నియోజకవర్గాలలో కూడా చేస్తారా అన్నది చూడాలి.