ఐటీ గ్రిడ్స్‌ కేసులో ఏపీ ప్రభుత్వానికి నోటీసులు

SMTV Desk 2019-03-28 11:30:24  IT grids,

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐటీ గ్రిడ్స్‌ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఐటీ గ్రిడ్స్ కేసులో ఎన్నికల అధికారులను ఇంప్లీడ్ చేయవద్దంటూ దాఖలైన పిటిషన్‌పై కోర్టులో వాదనలు జరిగాయి. అయితే ఏపీ ప్రభుత్వం, ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి సహా ఆధార్‌ సంస్థ కేంద్ర సీఈవో, ఆధార్‌ ఏపీ రిజిస్ట్రార్‌కు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ తదుపరి విచారణను ఏప్రిల్‌ 22కు వాయిదా వేసింది.