యాక్టింగ్‌ వదిలేసి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చాను

SMTV Desk 2019-03-28 11:17:38  Pawan Klayan, Janasena,

జనసేన టీడీపీ భాగస్వామేనంటూ వైసీపీ అధినేత జగన్‌ చేసిన వ్యాఖ్యలపై పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. దొంగపొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం జనసేనకు లేదని తేల్చి చెప్పారు. తల తెగిపడినా జగన్‌లా మోడీ, అమిత్‌షాల ముందు మోకరిల్లబోమని స్పష్టంచేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. యాక్టింగ్‌ వదిలేసి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తనను యాక్టర్‌ అని జగన్‌ పిలిస్తే.. మరి జైలులో ఉండి వచ్చిన ఆయనను ఎలా పిలవాలని ప్రశ్నించారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రకాశం జిల్లాకు వెనుకబడిన నిధులు ఇవ్వని కేంద్రం వద్ద తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టబోనన్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీలతో పొత్తులపై బహిరంగంగా చెప్పాలని వైసీపీను పవన్‌ డిమాండ్‌ చేశారు. పోటీ పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు కోచింగ్‌ సెంటర్‌లను ఏర్పాటు చేస్తామని పవన్‌ హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లాను ఎవరూ చేయని రీతిలో అభివృద్ధిచేస్తామన్నారు. ప్రతి కుటుంబానికి రూ.10లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని భరోసా ఇచ్చారు.