నీతా అంబానీ తన కోడలికి పెళ్లి కానుకగా రూ.300 కోట్లు వజ్రాల నెక్లెస్‌

SMTV Desk 2019-03-27 15:11:06  neetha mabani, pelli kanuka

భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ తనయుడు ఆకాష్‌ అంబానీకి, అతని చిన్నప్పటి స్నేహితురాలు శ్లోకా మెహతాకు ఈనెల తొమ్మిదిన ముంబయిలో అత్యంత వైభవంగా వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తన కోడలు శ్లోకాకు నీతా అంబానీ పెళ్లి కానుకగా రూ.300 కోట్లు విలువచేసే వజ్రాల నెక్లెస్‌ను అందించారు.

తొలుత నీతా అంబానీ తమ కుటుంబ వారసత్వంగా వస్తున్న బంగారం హారాన్ని కోడలికి పెళ్లిలో కానుకగా ఇవ్వాలనుకున్నారు. కానీ దానికి భిన్నంగా ప్రపంచంలోనే అత్యంత విలువైన నగను ఎంపిక చేయాలనుకున్నారు. దాంతో వజ్రాలు, ఇతర విలువైన రాళ్లు పొదిగిన నెక్లెస్‌ను ప్రత్యేకంగా డిజైన్‌ చేయించి శ్లోకాకు అందించారు నీతా అంబానీ. అత్త ఇచ్చిన విలువైన నగతో మురిసిపోయింది కొత్త కోడలు శ్లోకా. అయితే, శ్లోకకు అత్తింటివారు విలువైన బహుమతి ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. వివాహం నిశ్చయమైన తరువాత ఆకాష్‌ తన ప్రేమకు గుర్తుగా పూర్తిగా బంగారం పూతతో ప్రత్యేకంగా తయారు చేసిన ఏడు కోట్ల రూపాయల విలువైన కారును కానుకగా అందించాడట.