రూ. 500 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత

SMTV Desk 2019-03-27 15:08:55  500 cr hireon,

గుజరాత్ : భారత్ లో ఎంతగా నిఘా పెట్టిన మత్తు పదార్ధాల అక్రమ రవాణాలు కొనసాగిస్తున్నానే ఉన్నారు స్మగ్లర్లు. ఈ క్రమంలో సముద్ర తీరంలో భారీగా హెరాయిన్ స్మగ్లింగ్ జరుగుతుందనే సమాచారం అందుకున్న ఇండియన్ కోస్ట్ గార్డ్స్ స్మగ్లర్స్ చెక్ పెట్టారు. రూ. 500 కోట్ల విలువైన హెరాయిన్ ను తరలిస్తున్న బోటుపై దాడి చేసి..ఇరాన్ దేశానికి చెందిన 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ రాష్ట్ర సముద్ర తీరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

బోటుపై దాడి చేసిన అనంతరం కోస్ట్ గార్డ్ అధికారులు బోటుతో పాటు మాదకద్రవ్యాలను ధ్వంసం చేశారు. వందల కేజీల హెరాయిన్ ను భారత్ లోకి అక్రమంగా తరలించేందుకు ఇరాన్ జాతీయులు ప్రయత్నిస్తుండగా వారి ఆట కట్టించారు. ప్రస్తుతం వారిని నావికాదళ అధికారులు విచారిస్తున్నారు.