డ్యుయల్ రోల్ తో అలరించబోతున్న ప్రభాస్

SMTV Desk 2019-03-27 10:49:41  Prabhas

బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సాహో సినిమా ఆగష్టు 15న రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. సుజిత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ వారు 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సాహో సినిమా హాలీవుడ్ సినిమాలకు ధీటుగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు.

జాన్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. 1970 కాలంలో జరిగే ప్రేమకథగా ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. సినిమాలో ప్రభాస్ డ్యుయల్ రోల్ చేస్తాడని తెలుస్తుంది. 1970 కాలంతో పాటుగా 2019లో కూడా కథ నడుస్తుందని తెలుస్తుంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు.