న్యూఢిల్లీ, మార్చ్ 26: జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ మందగించడం వల్ల దేశీ మార్కెట్లో మంగళవారం బంగారం ధర క్షీణించింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. పది గ్రాముల బంగారం ధర రూ.50 తగ్గుదలతో రూ.33,170కు క్షీణించగా, కేజీ వెండి ధర రూ.100 తగ్గుదలతో రూ.39,100కు చేరింది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50 తగ్గుదలతో రూ.33,170కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.50 తగ్గుదలతో రూ.33,000కు క్షీణించింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.26,400 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. కేజీ వెండి రూ.100 తగ్గుదలతో రూ.39,100కు క్షీణిస్తే.. వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.1 పెరుగుదలతో రూ.38,365కు చేరింది. హైదరాబాద్లో10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.32,170కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,640కు తగ్గింది. కేజీ వెండి ధర రూ.41,300 వద్ద కొనసాగుతోంది.