లక్నో, మార్చ్ 26: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ తమ కూటమికి సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఎస్పీ-బిఎస్పీ కూటమిలో మరో మూడు పార్టీలు చేరుతున్నట్లు ప్రకటించారు. నిషద్ పార్టీ, జన్వాడి పార్టీ, రాష్ట్రీయ సమతా దళ్ నాయకులు కూటమికి విజయానికి కృషి చేస్తారని తెలిపారు. ఈ పార్టీలకు కొన్ని సామాజిక వర్గాల్లో పట్టు ఉండడమే పొత్తుకు కారణంగా తెలుస్తుంది. ఎలాగైనా బిజెపి ఓటమి లక్ష్యంగా పనిచేస్తున్న కూటమికి ఈ మూడు పార్టీలు కొంత ఊరటనిచ్చాయి. అందుకే అఖిలేష్ ఈ పార్టీలతో పొత్తుకు అంగీకరించారు.