రీసెంట్ గా ఓ సినిమా ఆడియో వేడుకలో తమిళ నటుడు రాధా రవి హీరోయిన్ నయనతార పై చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. చూపులతో వల్లో వేసుకునే వారికి దేవత పాత్రలు ఇస్తున్నారని.. ఒకేసారి దెయ్యంగా.. సీతగా నయనతార చేస్తుందని.. అప్పట్లో కె.ఆర్ విజయ అలా చేసేవారని అవహేళన చేశాడు. రాధా రవి వ్యాఖ్యలకు వెంటనే వరలక్ష్మి శరత్ కుమార్, దర్శకుడు విఘ్నేష్ శివన్ మండిపడ్డారు.
నడిగర్ సంఘం కూడా రాధా రవి వ్యాఖ్యలు ఖండిస్తూ ప్రకటన రిలీజ్ చేసింది. రాధా రవి వ్యాఖ్యలపై నయనతార కూడా త్వరగానే స్పందించింది. రెండు పేజీల మ్యాటర్ తో ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది నయనతార. సాధారణంగా పబ్లిక్ స్టేట్ మెంట్స్ ఇవ్వను.. నేను కాదు నా వృత్తి మాట్లాడాలి అన్నది నా స్వభావం. అనివార్య కారణాల వల్ల ఇలాంటి పరిస్థితుల్లో మాట్లాడాల్సి వస్తుందని అన్నారు నయనతార.