కోల్కతా, మార్చ్ 25: ఐపీఎల్ 2019 సీజన్లో వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్లో ముంబై పరాజయ పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ అనంతరం కోల్కతా అభిమానులు చూపించిన ప్రమాభిమానాలకు నైట్రైడర్స్ ఆటగాడు ఆండ్రూ రస్సెల్ ఉద్వేగానికి గురై ఓ దశలో కంటతడి పెట్టుకోవానుకున్నాడని ఆ జట్టు యజమాని, బాలీవుడ్ సూపర్స్టార్ షారూఖ్ ఖాన్ వెల్లడించారు. ఈ సందర్భంగా తమకు మద్ధతు తెలపడానికి భారీ సంఖ్యలో వచ్చిన అభిమానులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఓడిపోతారనుకున్న మ్యాచ్ గెలవడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మ్యాచ్ పూర్తయ్యాక షారూఖ్ ఈ విషయాన్ని ట్విట్టర్లో పోస్టు చేశారు.