ముంబై ఇండియన్స్‌లోకి మలింగా!

SMTV Desk 2019-03-26 10:44:38  mumbai indians, ipl 2019, sri lanka cricketer, malinga

మార్చ్ 25: శ్రీలంక పేసర్‌ లసిత్‌ మలింగా త్వరలో ముంబై ఇండియన్స్‌ జట్టుతో కలిసే అవకాశాలున్నట్లు సమాచారం. వరల్డ్‌కప్‌ సెలెక్షన్‌ కోసం ఈ నెల 30 నుంచి జరిగే దేశవాళీ ప్రొవెన్షియన్‌ వన్డే టోర్నీలో తప్పనిసరిగా ఆడాలని లంక బోర్డు నిబంధన విధించడంతో.. మలింగ స్వదేశానికి పయనమయ్యాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ లంక క్రికెట్‌ బోర్డును మలింగా విషయంలో స్పష్టత కోరినట్లు తెలిసింది. దాంతో చేసేదిలేక మలింగాకు ఎస్‌ఎల్‌సీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.‘ఐపీఎల్‌లో మలింగా ఆడటానికి ఎటువంటి ఆటంకాలు లేవు. ఇప్పటికే అతనికి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ ఇచ్చేశాం. అతనికి జట్టులో చోటు కల్పించే విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఐపీఎల్‌ ఆడినా.. వరల్డ్‌కప్‌కు వెళ్లే మా జట్టులో మలింగా స్థానంపై ఢోకా ఉండదు’ అని ఎస్‌ఎల్‌సీ చీఫ్‌ సెలక్టర్‌ అశంతా డిమెల్ పేర్కొన్నారు.