గ్యాంగ్టక్, మార్చ్ 25: భారత ఫుట్బాల్ జట్టు మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా తన రిటైర్మెంట్ తరువాత రాజకీయరంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం హమ్రో సిక్కిం పార్టీ(హెచ్ఎస్పి) పేరుతో సొంతంగా రాజకీయ పార్టీని కూడా స్థాపించారు. త్వరలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈ పార్టీ తొలిసారిగా బరిలోకి దిగుతుంది. ఐతే ఎన్నికల ఖర్చు కోసం విరాళాలు సేకరించేందుకు భూటియా తన జెర్సీలను అమ్మకానికి పెట్టారు. తనకెంతో ఇష్టమైన రెండు జెర్సీలను ఆన్లైన్ ద్వారా వేలానికి ఉంచారు. ఇందులో ఒకటి 2012లో తన వీడ్కోలు మ్యాచ్లో ధరించిన జెర్సీ కావడం గమనార్హం. 2014లోక్సభ ఎన్నికల్లో, 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ తరఫున పోటీ చేసి భూటియా ఓడిపోయారు. గతేడాది మార్చిలో హమ్రో సిక్కిం పార్టీ పేరుతో సొంత రాజకీయ పార్టీని ప్రారంభించారు.