హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. గోరంట్ల మాధవ్ నామినేషన్ వేసుకోవచ్చిన హైకోర్టు తేల్చి చెప్పింది. అదేవిధంగా గోరంట్ల మాధవ్ నామినేషన్ కు ఎలాంటి అడ్డంకులు లేవని తీర్పు వెలువరించింది.
కాగా మాధవ్ వ్యవహారంలో ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. ఏపీ ప్రభుత్వం వేసిన స్టే పిటిషన్కు హైకోర్టు నిరాకరించింది. కాగా ఇప్పటికే హిందూపురం నుంచి మాధవ్ నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు తీర్పుతో ఆయన ఎన్నికల బరిలో దిగడం ఖాయమైంది. గోరంట్లకు అన్ని టెంక్షన్ లు పోయి ఊరట లభించినట్లైంది.