రోగిపై అత్యాచారం చేసిన ఆసుపత్రి సిబ్బంది

SMTV Desk 2019-03-25 18:23:49  rape on patient in hospital, uttarpradesh, meerat

లక్నో, మార్చ్ 25: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన రోగిపై ఆసుపత్రి సిబ్బంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దుర్ఘటన పూర్తి వివరాల ప్రకారం...యుపిలోని మీరట్ లో శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఓ వివాహిత ఇటీవల ఆస్పత్రిలో చేరింది. అయితే, ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు ఐసియుకు మార్చారు. ఆ సమయంలో అదే అదనుగా భావించిన ఆస్పత్రి సిబ్బంది నలుగురు ఐసియులోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. రోగికు నిద్రపోవడానికి ఇంజక్షన్ ద్వారా మత్తు మందు ఇచ్చి, ఆ తరువాత ఆస్పత్రి సిబ్బందే అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ దారుణానికి పాల్పడిన సమయంలో ఐసియులోని సిసి కెమేరాలను ఆఫ్ చేశారు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. కాగా, ఈ దారుణానికి పాల్పడిన సిబ్బందిని ఆస్పత్రి యాజమాన్యం విధుల నుంచి తొలగించింది.