మార్చ్ 25: పసిడి ధరలు మరోసారి ఎగిసిపడ్డాయి. సోమవారం దేశీ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ.170 పెరుగుదలతో రూ.33,220కు చేరింది. అయితే బంగారం ధర పెరుగగా వెండి ధర మాత్రం తగ్గింది. కేజీ వెండి ధర రూ.70 తగ్గుదలతో రూ.39,200కు క్షీణించింది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.170 పెరుగుదలతో రూ.33,220కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.170 పెరుగుదలతో రూ.33,050కు చేరింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.26,400 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. కేజీ వెండి రూ.70 తగ్గుదలతో రూ.39,200కు క్షీణిస్తే.. వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.8 తగ్గుదలతో రూ.38,364కు క్షీణించింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం విషయానికి వస్తే.. కొనుగోలు ధర రూ.80,000 వద్ద, అమ్మకం ధర రూ.81,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్లో10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.32,200 వద్ద, 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,670 వద్ద ఉంది. కేజీ వెండి ధర రూ.41,300 వద్ద కొనసాగుతోంది.